Header Banner

ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

  Thu May 29, 2025 16:30        Politics

రాష్ట్రంలోని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి శుభవార్త వచ్చనుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)లను త్వరలోనే చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లు, వినతులు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసింది. ఆర్థిక శాఖ మరియు ఉద్యోగుల సంక్షేమ విభాగాల మధ్య ఇప్పటికే కీలక చర్చలు జరిగాయి. మంగళవారం నుంచి ఉన్నతాధికారుల సమీక్షలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో రిటైర్మెంట్‌ సమయంలో ఉద్యోగులకు వెంటనే పింఛన్‌, గ్రాట్యుటీ వంటి లబ్ధులు అందేలా విధాన మార్పుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఈ లబ్ధుల చెల్లింపులో నెలలు గడిచేవి, కానీ ఈ మార్పుతో ఉద్యోగులు పదవీవిరమణ రోజునే ఆర్థిక భద్రత పొందగలుగుతారు.

 

ఇంతకే పరిమితం కాకుండా, ఉద్యోగుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇతర కీలక నిర్ణయాలను కూడా తీసుకోనుంది. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చివరి దశ చర్చలు జరుపుతోంది. రేపు జరగనున్న క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డీఏల చెల్లింపుతో పాటు, ఉద్యోగుల పింఛన్‌, గ్రాట్యుటీ లాంటి ఇతర సమస్యలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన హామీల అమలుపైనా సమీక్ష జరగనుంది. సీఎంఓ నుంచి సంబంధిత శాఖల అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచుతాయి. డీఏల చెల్లింపు వల్ల ఉద్యోగుల కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుంది. ధరల పెరుగుదల దృష్ట్యా డీఏలు ఉపశమనంగా మారతాయి. అలాగే పదవీ విరమణ సమయంలో వెంటనే లభించే లబ్ధులు ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. ఈ చర్యలు కేవలం ఉద్యోగులకే కాకుండా, వారి కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పిస్తాయని, అలాగే ప్రభుత్వ పరిపాలనను బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత! 150కి పైగా సినిమాల్లో..

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

కవిత ఘాటు వ్యాఖ్యలు! ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా?

 

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

వారికి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షలు! ఇది మీకు తెలుసా?

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

ఏపీలో వారందరికీ కొత్త పింఛన్లు! జూన్ నుండే రూ.4 వేలు .. డేట్ ఫిక్స్!

 

ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!

 

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే! 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!



కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #GoodNews #SalaryHike #EmployeeBenefits #GovernmentEmployees #PayRevision